Live cricket score and updates of 2nd ODI of India and New Zealand from Pune's Maharashtra Cricket Association Stadium. <br />పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. <br />కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (11) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చిన పెవిలియన్కు చేరాడు. <br />జట్టు స్కోరు 25 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (3) ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. <br />ఆరో ఓవర్ చివరి బంతికి మన్రో (17)ను భువి పెవిలియన్కు పంపాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. <br />జట్టు స్కోరు 58 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రాస్ టేలర్ (21) వద్ద ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో 16 ఓవర్లకు గాను న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లాథమ్ 12, హెన్రీ 4 పరుగులతో ఉన్నారు.
